Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ రాజకీయాలంతా పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు నుంచి పవన్ కల్యాణ్ స్టేట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పలు శాఖలకు మంత్రి.
ఈక్రమంలో జనసేన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన పవన్ ఫ్యామిలీ పిక్ ఆయన అభిమానులను, నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందులో పవన్ శ్రీమతి అనా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్య కలిసి దిగిన ఫొటో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అయితే.. ఇంతటి అరుదైన పిక్ రావడానికి కారణం జూన్ 12న జరిగిన కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం. మంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత మంగళగిరిలోని నివాసానికి వెళ్తూండగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కార్ రోడ్డు పక్కన పార్క్ చేసి రిలాక్స్ అయిన సమయంలో ఈ ఫొటో దిగారు. సూపర్ పిక్, వెరీ స్పెషల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.