Gautham Ghattamaneni: తన కుమారుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ను చూస్తే మనసు ఉప్పొంగిపోతోందని సంతోషం వ్యక్తం చేశారు నమ్రతా శిరోద్కర్ (Namrata Sirodkar). ఈమేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. తన తొలి ప్రదర్శనలోనే నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని అభిమానులతో సంతోషం పంచుకున్నారు. ఈమేరకు చేసిన సోషల్ మీడియా పోస్ట్, పిక్ వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ (Mahesh) తోపాటు సితార (Sitara) కూడా ఉన్నారు.
‘తొలిసారి గౌతమ్ ఇచ్చిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. గౌతమ్ నటనను అందరూ ఎంజాయ్ చేశారు. “జాయ్ ఆఫ్ డ్రామా” పేరుతో లండన్లో నిర్వహించిన సమ్మర్ ప్రోగ్రామ్ జరిగింది. పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో గౌతమ్ నటన చూడటం ఓ అనుభూతి’ అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వీరు తీసుకున్న పిక్స్ అభిమానులను అలరిస్తున్నాయి. గౌతమ్ బాల నటుడిగా 1 నేనొక్కడినే సినిమాతో 10ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చారు. ఇటివల గౌతమ్ గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
I have read so many posts concerning the blogger lovers
however this paragraph is in fact a nice post, keep it up.