Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి (Rajamouli) దర్శక ప్రతిభను కొనియాడింది. అనేక ప్రపంచ సినీ వేదికలపై కొన్నాళ్లపాటు వీరి హావా కొనసాగింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపైనే కాదు.. ప్రపంచ ప్రఖ్యాత దిగ్దర్శకులు సైతం రాజమౌళి పనితీరును మెచ్చుకున్నారు.
ఇప్పుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. దర్శకుల కేటగిరీలో ఆస్కార్ అకాడమీలోకి ఆహ్వానం అందుకున్నారు. ఆయనతోపాటు కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీలో ఆయన భార్య రమా రాజమౌళికి సైతం ఈ గౌరవం అందుకున్నారు. దీంతో వీరు ప్రతి ఏటా తమ ఓటింగ్ వేయనున్నారు. గతంలో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr Ntr), కీరవాణి, సెంథిల్ కుమార్ లకు చోటు దక్కింది.
ఈ ఏడాది 57దేశాల నుంచి మొత్తంగా 487 మందికి అకాడమీ ఆహ్వానం పంపించింది. భారత్ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న వారిలో వీరిద్దరితోపాటు షబనా ఆజ్మీ, రవి వర్మన్, రితేశ్ సిద్వానీ తదితరులు ఉన్నారు.