Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కి అభిమాన ఘనం పెద్దదే అనే విషయం మరో మారు నిరూపితం అయ్యింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి కొండ గట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం లభించింది. అభిమానులతో పాటు, టీడీపీ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు.
మార్గమధ్యంలో పవన్ కళ్యాణ్ ను గజమాలతో ఫ్యాన్స్ సత్కరించారు. జనసేన పార్టీ అధినేతగా చాలా సార్లు గతంలో కొండగట్టు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఈసారి ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు వెళ్లడం జరిగింది. ఆలయ ప్రధాన ఆర్చకులతో పాటు, ఆలయ అధికారులు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సాదర స్వాగతం పలికారు.