సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబును రాజకీయంగా మరింత దెబ్బ కొట్టేందుకు వైసీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలో 2014లో 14కు గానూ 6 నియోజకవర్గాల్లో గెలిచింది టీడీపీ. 2019లో కుప్పంలో చంద్రబాబు గెలుపుతో కేవలం 1సీటుకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో జిల్లాలో మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం తేవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. స్థానిక ఎన్నికల్లోపు జిల్లా కేడర్ ను బలపరిస్తే విజయం సాధించడంతో పాటు రాబోయే సంవత్సరాల్లో మరింత బలపడుతుందని ఆశిస్తున్నారు. అయితే.. చంద్రబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండా వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
జిల్లాలోని టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి కేడర్ ను వైసీపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. జిల్లాల్లో ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు లలిత కుమారి, ఏఎస్ మనోహర్ లు వైసీపీలో చేరడం ఖాయం అంటున్నారు. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కూడా కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారని సమాచారం.
ఆయన కూడా వైసీపీ గూటికే వస్తారని అంటున్నారు. స్థానిక ఎన్నికల లోపే ఈ చేరికలు జరిగేలా వైసీపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో టీడీపీ కోలుకోవడం కష్టం అంటున్నారు. ఇందుకు జిల్లాలోని వైసీపీ అగ్ర నాయకత్వం తగిన ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.
290641 57848I recognize there is certainly a terrific deal of spam on this weblog. Do you want help cleansing them up? I may possibly assist in between classes! 529573
252440 981264educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 686001