దేశ రాజధాని ఢిల్లీ భారీ బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు ధాటికి నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. గణతంత్ర దినోత్సవ బీటింగ్ రిట్రీట్ జరిగే ప్రాంతానికి 1.4 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కోసం ఐఈడీ ఉపయోగించినట్టు అధికారులు నిర్ధారించారు.
పేలుడు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ స్పెషల్ పోలీసులు, స్పెషల్ స్క్వాడ్ అక్కడికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన రోడ్డును పోలీసులు మూసివేశారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడుకు పూల కుండీని ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో బీటింగ్ రిట్రీట్ వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఈ సాయంత్రం 5:45 నిముషాలకు ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది.
341155 827284Good read, I just passed this onto a colleague who was doing a bit research on that. And he just bought me lunch since I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 158758