జాతీయ సినీ పురస్కారాల ప్రకటన నిన్న జరిగింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలు చిత్రాలు ఈసారి జాతీయ అవార్డుల్ని బాగానే దక్కించుకున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమా తరఫున జాతీయ పురస్కారాలకు ‘బెస్ట్ హీరోయిన్’ కేటగిరీలో కీర్తి సురేష్ అవకాశం దక్కింది. ఎప్పుడో ‘కర్తవ్యం’ సినిమాకి విజయశాంతి ఆ పురస్కారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఆ అవార్డ్ తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్కి రావడం ఇప్పుడే జరిగింది.
ఇక, ఉత్త నటుడి కేటగిరీకి సంబంధించి రామ్చరణ్కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ సినీ పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతోంది. ‘రంగస్థలం’ రామ్చరణ్ కెరీర్లో బెస్ట్ సినిమా అన్నది నిర్వివాదాంశం. విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది ‘రంగస్థలం’. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టింది ఈ సుకుమార్ సెల్యులాయిడ్. ‘మగధీర’తో చరణ్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ వున్నాగానీ, నటుడిగా చరణ్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్ళిన సినిమా ‘రంగస్థలం’ అన్నది నిర్వివాదాంశం. అయినాగానీ, చరణ్కి ఎందుకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ దక్కలేదో చాలామందికి అర్థం కావడంలేదు.
సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడు ఢిల్లీలో జరిపిన లాబీయింగ్ కారణంగానే చరణ్ అద్భుతమైన అవకాశం కోల్పోయాడంటూ టాలీవుడ్లో ఓ బలమైన వాదన విన్పిస్తోంది. చిరంజీవికి అత్యంత సన్నిహితుడేనట సదరు సినీ ప్రముఖుడు. నిజమేనా.? ఇలాక్కూడా జరుగుతుందా.? అన్న సందేహాలు ఓ పక్క వ్యక్తమవుతున్నా, మెజార్టీ అభిప్రాయం మాత్రం చరణ్కి అన్యాయం జరిగిందనే. ఈ విషయంలో చరణ్ పట్ల చాలా సానుభూతి వ్యక్తమవుతోంది.
అయితే, చరణ్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నేషనల్ అవార్డ్ విన్నర్స్ని సోషల్ మీడియా వేదికగా అభినందించాడు. అన్నట్టు, ‘రంగస్థలం’ సినిమా కూడా ఆడియోగ్రఫీ విభాగంలో జాతీయ పురస్కారం దక్కించుకుంది. అయితే, అది గౌరవం కాదు.. అవమానకరం.. అంటున్నారు కొందరు. ఏదిఏమైనా, అవార్డుల చుట్టూ వివాదాలు చెలరగేడం సర్వసాధారణమైపోయింది. లాబీయింగ్ చేస్తేనే అవార్డులొస్తాయంటూ చాలాసార్లు చాలామంది ప్రముఖులే విమర్శించారు. సో, అలాంటి లాబీయింగ్ అవార్డుల విషయంలో అంతగా ఆందోళన చెందక్కర్లేదంటూ కొందరు మెగా అభిమానులే సరిపెట్టుకుంటున్నారు.
843997 844228Hey, are you having issues with your hosting? I needed to refresh the page about million times to get the page to load. Just saying 108576