చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమురు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజేంద్ర రోజు మాదిరిగా విధులకు హాజరు కాకపోవడంతో ఉన్నతాధికారులు అతడికి కాల్ చేశారు. ఫోన్ ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఏఎస్ఐ మృతి సంగతి తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఎప్పుడు సరదాగా ఉండే రాజేంద్ర ఉరి వేసుకోవడం ఏంటీ అంటూ తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం పెనమూరు నుండి బదిలీపై కుప్పంకు వచ్చిన రాజేంద్ర వయస్సు 57 ఏళ్లు. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్న సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే రాజేంద్రకు చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్కు బదిలి అయ్యింది. కాని లాక్ డౌన్ వల్ల అక్కడకు వెళ్లలేక పోయాడు. త్వరలో రిలీవ్ అవుతాడు అనుకుంటున్న సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
832724 801275Wow, remarkable blog layout! How long have you been blogging for? you make blogging look straightforward. The overall look of your internet site is amazing, as properly as the content! 470658
506654 629458TeenVogue? Looking for fashion advice, celebrity buzz or beauty trends? Discover it all in Teen Vogue 180466