ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులకు సాధారణ పరిపాలన శాఖ ఛాంబర్లను కేటాయించింది. ఇందులో భాగంగా సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎంఓ కార్యాలయం, రెండో బ్లాక్ లో ఏడుగురు మంత్రులకు, మూడో బ్లాక్ లో ఐదుగురు మంత్రులకు కేటాయింపు జరిగింది. నాలుగో బ్లాక్ లో 8 మందికి, ఐదో బ్లాక్ లో నలుగురు మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఉన్న 211 రూమ్ ని కేటాయించారు. జనసేన పార్టీ నుంచి మంత్రులుగా ఉన్న నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ లకు డిప్యూటీ సీఎం పక్కనే ఛాంబర్లను ఏర్పాటు చేశారు. మంత్రి నారా లోకేష్ కి నాలుగో బ్లాక్ లోని మొదటి అంతస్తులు 208 ని కేటాయించారు.
*మంత్రుల* *ఛాంబర్ల* *వివరాలు*
రెండో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 135 లో పొంగూరు నారాయణ, రూమ్ నెంబర్ 136 హోం మంత్రి వంగలపూడి అనిత, రూమ్ నెంబర్ 137 దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉంటారు.
రెండో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నంబర్ 208 కందుల దుర్గేష్, 211 లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 212 లో పయ్యావుల కేశవ్, 215 లో నాదెండ్ల మనోహర్ ఆఫీస్ లను ఏర్పాటు చేశారు.
మూడో బ్లాక్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 203 లో గొట్టిపాటి రవికుమార్, 207 లో కొల్లు రవీంద్ర, 210 లో డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, 211 లో గుమ్మడి సంధ్యారాణి, 212 లో నాస్యం మహమ్మద్ ఫరూక్ ల చాంబర్లు ఉంటాయి.
నాలుగో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 127 అనగాని సత్యప్రసాద్, 130 కింజరాపు అచ్చెన్నాయుడు, 131 ఎస్ సవిత, 132 టీజీ భరత్ లకి కేటాయించారు. అక్కడే ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నంబర్ 208 లో నారా లోకేష్, 210 లో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, 211 లో కొలుసు పార్థసారథి, 212 లో నిమ్మల రామానాయుడు ఉంటారు.
ఐదో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 188 బీసీ జనార్దన్ రెడ్డి, 191 గదిని కొండపల్లి శ్రీనివాస్ లకు కేటాయించారు. అదే బ్లాక్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 210 లో వాసంశెట్టి సుభాష్, 211 లో సత్య కుమార్ యాదవ్ ల ఛాంబర్లు ఉంటాయి.