Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Suhhmita Konidela నిర్మాతగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘పరువు’. జీ5లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ కు మంచి పేరొస్తోంది. వెబ్ సిరీస్ ప్రచారంలో పాల్గొన్న సుస్మిత పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈక్రమంలో ఆమెకు తండ్రి చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ..
‘నా పరిధిలోలేని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ విషయాలు నాకు తెలీదు. అయితే.. రూమర్స్ వచ్చిన మాట నిజమే. కానీ.. ప్రస్తుతం మేము బాబాయి పవన్ కల్యాణ్ సాధించిన విజయం ఆనందంలో ఉన్నా’మని అన్నారు. అయితే.. ఇదే ప్రశ్న గతంలో చిరంజీవికి కూడా ఎదురవగా.. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నాకెవరూ ఆఫర్ చేయర’ని చెప్పిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి.. తర్వాతి సినిమా సుస్మిత బ్యానర్లోనే చేస్తారనే టాక్ ఉంది. దీనికి ఆమె అవుననే సమాధానమే ఇచ్చారు. తాను కూడా ఆసక్తిగా ఉన్నట్టు.. త్వరలోనే దర్శకుడిని ప్రకటిస్తామని సుస్మిత చెప్పారు.