ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ఎవరినీ వదలడంలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్య సిబ్బంది నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ సోకుతోంది. తాజాగా మీడియాపైనా అది ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సాక్షి దినపత్రిక సీనియర్ రిపోర్టర్ కరోనా బారిన పడగా.. తాజాగా మరో దినపత్రికలో 8 మంది ఎడిటోరియల్ సిబ్బందికి ఈ మహమ్మారి సోకినట్టు సమాచారం. దీంతో వారందరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, వారితో సన్నిహతంగా ఉన్న 30 మందిని క్వారంటైన్ చేసినట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా ప్రజలతోపాటు చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు ఇళ్లకే పరిమితం కాగా.. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇంకా పలువురు అత్యవసర సేవలకు చెందినవారు మాత్రం తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వీరితోపాటే పాత్రికేయులు కూడా తమ విధులు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రబలిన తొలినాళ్లలో ముంబైలోని ఓ ఛానల్ లో దాదాపు 45 మందికి ఈ వైరస్ సోకింది. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరో, ముగ్గురు పాత్రికేయులకు మినహా ఇప్పటివరకు కరోనా సోకినట్టు ఎక్కడా రికార్డు కాలేదు. అయితే, మీడియా సంస్థల్లోని ఇతర విభాగాల్లో పనిచేసేవారు కొంతమంది దీని బారిన పడినా.. జర్నలిస్టులు మాత్రం పెద్ద సంఖ్యలో దీనికి ప్రభావితం కాలేదు.
ఈ నేపథ్యంలో సాక్షి రిపోర్టర్ కు ఈ వైరస్ నిర్ధారణ కావడంతో కాస్త కలకలం రేగింది. తాజాగా ఒకేరోజు ఏకంగా 8 మంది జర్నలిస్టులకు పాజిటివ్ అని తేలడంతో పాత్రికేయుల్లో ఆందోళన మొదలైంది.
361461 769803There is noticeably a bundle to comprehend about this. I assume you produced specific good points in functions also. 496887
369622 673546Looking forward to look you. 599264
306709 705725Hello. I wanted to ask one thingis this a wordpress internet website as we are preparing to be shifting over to WP. Furthermore did you make this template yourself? Thanks. 978743
859061 124491I dugg some of you post as I thought they were incredibly helpful handy 247352