గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడానికి కారణం ఎవరు? ర్యాలీలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందన్న రైతు సంఘాల ఆరోపణలు నిజమేనా అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిధు వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయి. అల్లర్లకు అతడే కారణమని భావిస్తున్న అధికారులు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పంజాబ్ కు చెందిన దీప్ సిధు ప్రముఖ గాయకుడు. పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించారు కూడా. తొలి నుంచీ రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్న ఆయన.. రెండు రోజుల క్రితం ఢిల్లీ వచ్చారు.
సింఘు సరిహద్దుల్లో రైతులను ఉద్దేశించి రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్టు సమాచారం. మంగళవారం నాటి కిసాన్ పరేడ్ లోనూ ఆయన పాల్గొన్నారు. ఎర్రకోట వద్ద రైతులు తమ జెండాతోపాటు సిక్కు జెండాలను ఎగరేసిన సమయంలోనూ అక్కడే ఉన్నారు. దీనంతటికీ కారణం సిధునే అని రైతులు కూడా ఆరోపిస్తున్నారు. అసలు తాము ఎర్రకోటపై జెండా ఎగురవేయాలని అనుకోలేదని తెలిపారు. దీప్ సిధు సిక్కు కాదని, ఆయన బీజేపీ కార్యకర్త అని ఆరోపిస్తున్నారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను సిధు ఖండించారు.
213489 536657Hi! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any ideas? 902763