ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్కూల్ టీచర్ ఉద్యోగం చాలా సింపుల్గా వచ్చేది. పాతిక సంవత్సరాలకు ముందు వరకు వందల్లోనే జీతం ఉండటంతో ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలో టీచర్ ఉద్యోగంకు ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. వేలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు వస్తున్నాయి. ఎంతో కష్టపడితే కాని ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు. అలాంటిది ఉత్తరప్రదేశ్లోని అనామికా శుక్లా అనే ఉపాద్యాయురాలికి ఏకంగా 25 ప్రభుత్వ పాఠశాల్లో ఉద్యోగం సంపాదించింది, అది అక్రమంగానే లేండి.
తాను 25 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్నట్లుగా నమోదు చేసుకున్న అనామికా శుక్లా ప్రతి నెల కూడా 25 జీవితాలు ఎత్తుకుంటూ వచ్చింది. గత 13 నెలలుగా ఈమె కోటికి పైగా జీతం ఎత్తింది. ఏంతటి మోసం అయినా కూడా ఏదో ఒక రోజు బయట పడాల్సిందే. ఆ మోసం ఇప్పుడు బయట పడినది. ప్రభుత్వం పాఠశాలలు మరియు స్టూడెంట్స్ ఉపాధ్యాయుల వివరాలతో ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన నేపథ్యంలో అనామిక శుక్లా ఏకంగా 25 స్కూల్స్లో జాబ్ చేస్తున్నట్లుగా గుర్తించారు.
అవాక్కయిన అధికారులు కాస్త లోతుగా విచారించడంతో ఆమె లొసుగులను ఉపయోగించుకుని ఏకంగా 25 స్కూల్స్లో పని చేస్తున్నట్లుగా రికార్డులు నమోదు చేసింది. దాంతో ఆమెకు ప్రతి నెల 25 జీవితాలు రావడంతో ఇప్పటి వరకు కోటి రూపాయల జీతం వచ్చింది. ఆమెపై కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు ఆమె నుండి డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
739820 83766I feel other website proprietors should take this internet site as an model, very clean and superb user genial style . 763377
775822 836457I enjoy the useful information you give within your articles. 462800