ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2024 ( AP TET-2024) కొత్త నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి..2 వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి షెడ్యూల్, సిలబస్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, పరీక్ష విధానం తదితర అంశాలను విద్యాశాఖ అధికారులు రెడీ చేశారు. ఈ సమాచారాన్ని జూలై 2 నుంచి https://cse.ap.gov.in/ వెబ్సైట్ నుంచి పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థులకు కావలసిన అదనపు సమాచారం కోసం హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు 2.35 లక్షల మంది హాజరవ్వగా 1,37,903 మంది అర్హత సాధించారు. అప్పుడు ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ని కొత్త ప్రభుత్వం రద్దుచేసి.. 16,347 పోస్టులకు మెగా డీఎస్సీని ప్రకటించింది. పాత నోటిఫికేషన్ లో టెట్ ఫెయిల్ అయిన వారు, ఇటీవల బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారికి అవకాశం కల్పిస్తూ మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.