యంగ్ హీరో చేతన్ కృష్ణ, అందాల భామ హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధూం ధాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్.రామ్ కుమార్ నిర్మిస్తుండగా సాయి కిషోర్ మచ్చా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ‘మల్లెపూల ట్యాక్సీ’ అంటూ ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సింగర్ మంగ్లీ పాడిన ఈ పాటకు ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ సాంగ్ ‘మాయా సుందరి’ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పాటకు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి చక్కటి లిరిక్స్ అందించగా సంగీత దర్శకుడు గోపీ సుందర్ మంచి బీట్స్ తో ఆకట్టుకునే సంగీతం అందించారు. ప్రముఖ సింగర్ అనురాగ్ కుల్కర్ణి తనదైన వాయిస్ తో ఆడియెన్స్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు.
ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, ప్రవీణ్, నవీన్ నేని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.