మహారాష్ట్ర థానే జిల్లా షాహాపూర్ పట్టణంలో దారుణం జరిగింది. ఆ పట్టణంకు చెందిన అటగావ్లో ఉండే ఒక ఇంట్లో బర్త్డే పార్టీ జరిగింది. ఆ బర్త్డే పార్టీకి వెళ్లిన 28 ఏళ్ల సిద్దేష్ జనగం అనే వ్యక్తి హాజరు అయ్యాడు. బర్త్డే పార్టీలో ఎవరి హడావుడిలో వారు ఉండగా సిద్దేశ్కు ఒక తుపాకి కనిపించింది. అతడు దాన్ని బొమ్మ తుపాకిగా భావించాడు. ఆ తుపాకిని నుదుటికి పెట్టుకుని కాల్చుకున్నాడు. బొమ్మ తుపాకి అని కాల్చుకుంటే అది కాస్త నిజం తుపాకి అవ్వడంతో సిద్దేష్ తల నుండి బుల్లెట్ దూసుకు వెళ్లింది.
తుపాకి శబ్దం పెద్దగా రావడంతో స్థానికులు అంతా అక్కడకు చేరుకున్నారు. రక్తం మడుగులో సిద్దేశ్ పడి ఉన్నాడు. అతడి చేతిలోనే గన్ ఉంది. పోలీసులు అక్కడకు చేరుకుని గన్ స్వాదీనం చేసుకుని సిద్దేశ్ డెడ్ బాడీకి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గన్ ఓనర్పై మరియు బర్త్డే పార్టీ నిర్వహించిన నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో పార్టీకి హాజరు అయిన వారిని కూడా పోలీసులు ప్రశ్నించారు.
120788 77290Beneficial information and excellent style you got here! I want to thank you for sharing your tips and putting the time into the stuff you publish! Excellent work! 753367