డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan) అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా.. ఎప్పుడెప్పుడు ఆయన ప్రసంగం విందామా.. అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. యావత్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన తొలి ప్రసంగం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ఎన్నిక జరిగింది. అసెంబ్లీ స్పీకర్ గా తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనని ఉద్దేశించి పవన్ మాట్లాడారు.
‘ రుషికొండకు గుండు కొట్టినట్లు ప్రత్యర్థులను ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేసేవారు. ఇకపై ఆయనకు తిట్టే అవకాశం లేదు. ఈసారి సభలో ఎవరు తిడుతున్న దాన్ని మీరే ఆపాలి. చిన్నప్పుడు స్కూల్లో అల్లరి చేసే వాళ్ళని లీడర్ క్లాస్ లీడర్ ని చేసేవారు కదా అలా’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ని ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు తోటి సభ్యులందరూ నవ్వుతూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ తన ప్రసంగంతో ఇకపై అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతున్నారని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.