ఎన్టీఆర్ గురించి తనకు పెద్దగా తెలియదు అంటూ ఒక లైవ్ చాట్ లో వ్యాఖ్యలు చేసినందుకు గాను నందమూరి అభిమానుల ట్రోల్స్కు గురి అవుతున్న హీరోయిన్ మీరా చోప్రా విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. కేటీఆర్తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో విషయం సీరియస్ అయ్యింది. ట్విట్టర్లో వేలల్లో ఈమెపై బ్యాడ్ కామెంట్స్ పెట్టడంతో పోలీసులు వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మీరా చోప్రాను బూతులు తిట్టడంతో పాటు చంపేస్తామంటూ బెదిరించిన దాదాపు 20 మందిని పోలీసులు గుర్తించారు. వారి అకౌంట్స్ ఆధారంగా పోలీసులు వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు. కాని ఇప్పటికే 10 అకౌంట్స్ డిలీట్ అయ్యి ఉన్నాయి. దాంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. అందుకే వారికి సంబంధించిన డేటా ఇవ్వాల్సిందిగా ట్విట్టర్ సంస్థకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు.
కొందరు విదేశాల నుండి కూడా ఉండటంతో వారికి మెయిల్ ద్వారా నోటీసులు పంపించి వారిని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. మొత్తానికి పోలీసులు మీరా చోప్రా కేసు విషయంలో చాలా స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. అతి త్వరలోనే నిందితులను కఠినంగా శిక్షించే అవకాశం ఉందని పోలీసు వర్గాల వారు అంటున్నారు.
542072 323340Your write-up is truly informative. More than that, it??s engaging, compelling and well-written. I would desire to see even a lot more of these types of excellent writing. 538504