కోట్లాది భారతీయుల కల నెరవేరింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన వేళ.. టీమిండియా సగౌరవంగా T20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. శనివారం సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టీం 7 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ ( 76; 56 బంతుల్లో), అక్షర్ పటేల్ ( 47; 31 బంతుల్లో) టాప్ స్కోరర్లు. అనంతరం చేజింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 169 పరుగులకు పరిమితమైంది. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లు చెలరేగి ఆడటంతో T20 ప్రపంచ కప్ టీమిండియా సొంతమైంది.
రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
T20 లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికా తో ఆఖరి మ్యాచ్ ఆడి వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు. ‘ ఇదేనా ఆఖరి ప్రపంచ కప్. T20 మ్యాచ్ కూడా ఇదే చివరిది. తర్వాతి తరాలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నాను. కప్పు గెలవకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడిని’ అని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపాడు.