తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కరోనా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో వారు పనుల్లోకి రాక పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారని, కోవిడ్ టెస్టులను కూడా సరిగా నిర్వహించట్లేదు అనే వాదన అటు ప్రజల నుంచి, ఇటు అధికారుల నుంచి గట్టిగా వినపడుతోంది. ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొన్ని రోజుల క్రితం దాఖలు అయిన పిటీషన్స్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో ఖచ్చితంగా మరణించిన వారికి కరోనా టెస్టులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. కరోనా నిర్ధారణ టెస్టుల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉందని కోర్టు తీర్పులో పేర్కొంది. కానీ తమ తీర్పు అమలు కావడం లేదని, చనిపోయిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడం లేదంటూ తమ దృష్టికి వచ్చిందనిహైకోర్టు పేర్కొంది. టెస్టులు నిర్వహించని కారణంగా వైధ్య ఆరోగ్య శాఖ అధికారులు కోర్టు దిక్కరణ చర్యలకు పాల్పడినట్లుగా వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హై కోర్టు హెచ్చరించింది.
ప్రస్తుతం సుప్రీం కోర్టులో తీర్పుకు సంబంధించిన వాదనలు నడుస్తున్న కారణంగా పరీక్షలు నిర్వహించడం లేదని అడ్వకేట్ జనరల్ ఈ సందర్బంగా కోర్టుకు తెలియజేయడంతో సుప్రీం కోర్టులో తీర్పు వచ్చే వరకు హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే అని, అలా చేయకుంటే వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిపై, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఇందుకు బాధ్యుల్ని చేసి కోర్టు దిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రజల్లోకి వెళ్లి కరోనా ర్యాండమ్ టెస్టులు చేయట్లేదు, ప్రభుత్వం రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయకపోవడం వలనే వైద్య బృందానికి కరోనా సోకిందని, మీడియా బుల్లెటిన్ లో తప్పుడు లెక్కలు చెప్తే కోరు ధిక్కరణ చర్యలు చేపడతామని అధికారులపై మండిపడింది. వాస్తవాలు చెప్పకపోతే ప్రజలకి కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై వైధ్య ఆరోగ్య శాఖ ఈనెల 17వ తేదీలోపు అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
617372 794071Hey there! Someone in my Myspace group shared this website with us so I came to take a appear. Im certainly enjoying the data. Im bookmarking and will likely be tweeting this to my followers! Exceptional blog and outstanding style and style. 999963