సినిమా థియేటర్లలోనే కాదు, బయట కూడా సమోసా ధర 10 రూపాయలకు పైనే పలుకుతోంది. కొన్ని చోట్ల అది 15 నుంచి 20 రూపాయల మేర ధర పలుకుతున్న సంగతి తెలిసిందే. కానీ, సినిమా టిక్కెట్ల ధరల్ని ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు పరిమితం చేసింది గతంలో వైసీపీ సర్కారు.
అది కూడా, పవన్ కళ్యాణ్ సినిమాలకే.! పవన్ కళ్యాణ్ తరఫున వకాల్తా పుచ్చుకున్న హీరోల సినిమాల్నీ సైతం వైసీపీ సర్కారు వేధించిన విషయాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఎలా మర్చిపోగలదు.? అసలు హీరోలకెందుకు అంత రెమ్యునరేషన్.? అని ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మేసేసిన కొందరు ప్రజా ప్రతినిథులు ప్రశ్నించడం చూశాం.
కాలం మారింది.! జనం వైసీపీకి పాతరేసేశారు ఇటీవలి ఎన్నికల్లో. టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం. దాంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిసేందుకు తెలుగు సినీ ప్రముఖులు హైద్రాబాద్ నుంచి విజయవాడ పయనమయ్యారు.
సినీ ప్రముఖుల బృందం, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుంచనుంది. అయినా, పవన్ కళ్యాణ్కి ఆ సమస్యలు తెలియవా.? కాకపోతే, పరిశ్రమ నుంచి రిప్రెజెంటేషన్ అంటూ వుండాలి కదా.!
పరిశ్రమ సమస్యలకు దాదాపుగా పరిష్కారం దొరికేసినట్లే. కాకపోతే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ సినీ పరిశ్రమకు సంబంధించి పరిశ్రమ పెద్దలు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారా.? లేదా.? అన్నదే ప్రశ్న.
సినిమా షూటింగులెలాగూ ఆంధ్ర ప్రదేశ్లో కూడా జరుగుతాయి. ఆంధ్ర ప్రదేశ్కి స్టూడియోలు రావాలి, సినిమాకి సంబంధించి వివిధ విభాగాలు, ఆంధ్ర ప్రదేశ్లోనూ కొలువుదీరాలి. హైద్రాబాద్ ‘పెద్ద ఇల్లు’ అయితే, విశాఖ ‘చిన్న ఇల్లు’ అయ్యేందుకు ఆస్కారం వుంది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా సినీ రంగాన్ని ప్రోత్సహించే వ్యక్తే. మరో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా టీడీపీ ఎమ్మెల్యేగా వున్నారాయె.! ఎలా చూసినా, తెలుగు సినిమా పరిశ్రమకి ఆంధ్ర ప్రదేశ్లో మంచి రోజులు వచ్చినట్లే భావించాలి.