Viral: వాతావరణ పరిస్థితులతోనో, వర్షాభావ పరిస్థితుల్లోనో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. కానీ.. బ్రిటన్లో (London) ఇందుకు భిన్నంగా ద్రవ్యోల్బణ పరిస్థితులతో ధరలు మండిపోతున్నాయి. బెండకాయలు కేజీ రూ.650, ఆరు మామిడికాయలు రూ.2400.. ఇలా ధరలు మండిపోతున్నాయి. స్థానిక భారతీయ స్టోర్స్ లోని ధరలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పలువురు భారతీయులు లండన్లో తాము ఎదుర్కొంటున్న నిత్యావసరాల ధరలను పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఇండియాలో రూ.20కి దొరికే మసాలా అక్కడ రూ.95 వరకూ ఉంది. పన్నీర్ కూడా రూ.700, మ్యాగీ నూడుల్స్ రూ.300, కాకరకాయలు రూ.650 ఉన్నట్టు చెప్తున్నారు. దీంతో స్థానికంగా భారతీయులు ఈ ధరలతో హడలెత్తిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ పోస్ట్ చేశారు.
నిజానికి భారత్ రూపాయలకు, లండన్ పౌండ్స్ కు విలువలో తేడా ఉంటుందని తెలిసిందే. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ధరలు మరింత ఎక్కువగా ఉండటమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.