ఇప్పుడు రాజకీయాలంటే, జస్ట్ నెంబర్ గేమ్ అంతే.! ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే, వాళ్ళు అధికార పీఠమెక్కుతారు.! గెలిచినోడికీ, ఓడినోడికీ.. ఒక్కోసారి ఒకే ఒక్క ఓటు తేడా వుండొచ్చు.! బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనండీ.. ఇంకేదన్నా అనండీ.. ఈ లెక్క ఇంతే.!
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసినా, ఆ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓటు బ్యాంకు లభించింది. అప్పట్లో వైసీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించింది.. సంఖ్యా పరంగా.! అప్పట్లో జనసేన చీల్చిన ఓట్లు, టీడీపీకి శాపంగా మారాయి. వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యాయి.!
2023 ఎన్నికలొచ్చేసరికి, వైసీపీని అదఃపాతాళానికి తొక్కేశారు ఓటర్లు, సీట్ల పరంగా.! వైసీపీకి దాదాపు నలభై శాతం ఓట్లు వచ్చాయి. నలభై శాతం ఓట్లు వచ్చాయి గనుక, 175 సీట్లలో నలభై శాతం సీట్లు రావు కదా.? ఆ మాత్రం బుర్ర వుంటే, వైసీపీ నేతలెందుకవుతారు.? అందుకే, 40 శాతం ఓట్లు వచ్చాయ్.. నలభై శాతం సీట్లు కూడా రావాలంటూ మాజీ మంత్రులు కూడా గుస్సా అవుతున్నారు.
ఆ లిస్టులో తాజాగా మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా చేరిపోయారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందాన టీడీపీ, జనసేన ఉలిక్కిపడుతున్నాయంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యల్ని ‘ఇహిహి..’ అంటూ ఓ వికారపు నవ్వుతో చేసేశారు రోజా.
‘రాష్ట్రంలో పేదరికం వుండకూదన్న కోణంలో అద్భుతమైన పాలన అందించారనీ, సంక్షేమ పథకాల్ని అందించారనీ’ అధినేత జగన్ మీద అమితమైన అభిమానాన్ని చాటేసుకున్నారు ఆర్కే రోజా.!
వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో, వైసీపీ చేసిన సంక్షేమమేంటో ఓటర్లే తేల్చి చెప్పాక.. ఇక డిస్కషన్ అనవసరం.! ఓటు శాతానికీ, సీట్ల సంఖ్యకీ ముడిపెట్టే పీత బుర్రలు వైసీపీలో వుండబట్టే, వైసీపీ ఈ స్థాయికి పతనమైపోయింది. ఇదే తీరు కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా కష్టమే.!
రోజా భాషలోనే చెప్పాలంటే, డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్ళి తొడకొట్టకూడదు.!