ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాజధాని అవసరం లేదు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ‘రాచరికపు కోటలు’ కావాలి.! ఔను, రాజప్రాసాదాల్ని తలపించే, ప్యాలెస్సుల్ని జిల్లాకి ఒకటి చొప్పున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మించ తలపెట్టింది.
అధికారం తమ చేతుల్లో వుంటే, తాము చెప్పిందే రాజ్యాంగం మరి.! భూ కేటాయింపుల్ని నిర్లజ్జగా చేసేసుకున్నారు. పైగా, ‘క్యాబినెట్ నిర్ణయం మేరకు’ అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు గతంలో మంత్రులుగా పనిచేసి, అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న వైసీపీ నేతలు.
బాబోయ్.. ఇవేం కట్టడాలు.? అని జనం విస్తుపోతున్నారు. జనం అంటే, ఇప్పటిదాకా ఆ వైసీపీ ప్యాలెస్సుల గురించి తెలియనివారు. ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని, అప్పనంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం ఎలా కేటాయించుకున్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమీ కాదు.
ముప్ఫయ్యేళ్ళు అధికారం తమదేనని వైసీపీ గతంలో చెప్పుకుంది. సో, దాదాపు ముప్ఫయ్ ఏళ్ళకు లీజు.. అంటూ ఎకరాల కొద్దీ భూమిని తమ పరం చేసుకుని (ప్రభుత్వానికి సంబంధించిన భూములు), వాటిల్లో కోట్ల రూపాయల ఖర్చుతో వైసీపీ కార్యాలయాల్ని నిర్మించుకున్నారు.
విశాఖలో అయితే, ప్రజాధనంతోనే ప్యాలెస్సుని నిర్మించుకున్నారు వైఎస్ జగన్. దాన్ని స్టార్ హోటల్ అనీ, గెస్ట్ హౌస్ అనీ, సీఎం కార్యాలయం అనీ, పర్యాటక భవన సముదాయం అనీ.. రకరకాల పేర్లతో వైసీపీ పిలుచుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రజలకు రాజధాని అవసరం లేదా.? పేదలకేమో సెంటు, సెంటున్నర బూముల్లో ఇళ్ళ స్థలాలంటారా.? వైసీపీకి మాత్రం, ఎకరాల కొద్దీ భూములు పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకుంటారా.? ఇదెక్కడి రాజ్యాంగం.? ఇదెక్కడి పరిపాలన.
రాష్ట్రాన్ని గంప గుత్తగా వైసీపీ దోచేసుకుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఒకవేళ ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి వుంటే, రాష్ట్రం పరిస్థితేంటి.?