ఏపీలో రాజకీయాలు భలే చిత్ర విచిత్రంగా సాగుతున్నాయ్. మాదంటే మాది పైచేయి అని చాటుకునేందుకు అధికార, విపక్షాలు పోటీ పడుతున్నాయ్. రూల్స్ పేరుతో ఒకరిపై మరొకరు అస్త్రాలు సంధించుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులను శాసనమండలిలో అడ్డుకుని సెలక్ట్ కమిటీకి పంపించడం ద్వారా పైచేయి సాధించామని తెలుగుదేశం పార్టీ మురిసిపోగా.. అభివృద్ధిని అడ్డుకునే మండలి అవసరమా అని ఏకంగా దానిని రద్దు చేస్తూ అధికార పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి టీడీపీకి షాక్ ఇచ్చింది.
వాస్తవానికి మండలి నిబంధనల విషయంలో టీడీపీ ముందు నుంచీ పక్కాగా వ్యవహరించింది. శాసనసభలో ఆమోదం పొంది తమ వద్దకు వచ్చిన బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించే విషయంలో అనూహ్యంగా రూల్ నెంబర్ 71ని తెరపైకి తీసుకొచ్చి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు.
అసలు ఈ నిబంధన ఒకటి ఉందనే విషయం కూడా అధికార పార్టీ నేతలకు తెలియదనే చర్చ సాగింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మండలిని రద్దు చేస్తూ అధికార వైసీపీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అవి కమిటీకి వెళ్లిపోయినట్టేనని, ఇక వాటిపై ఆర్డినెన్స్ లు తీసుకురావడం కూడా కుదరదని టీడీపీ పేర్కొంది.
దీంతో వైసీపీ కూడా రూల్స్ పుస్తకం తిరగేసి, ఓ రూల్ పట్టింది. దానిని మండలి కార్యదర్శి ద్వారా ప్రయోగించారు. మండలి తీర్మానం నిబంధనల ప్రకారం లేదని, పైగా అది ప్రకటించి 14 రోజులు గడిచిపోయినందున బిల్లులపై సెలెక్ట్ కమిటీ వేయాలన్న నిర్ణయం చెల్లదని మండలి కార్యదర్శి తిప్పి పంపించారు. దీంతో టీడీపీ అవాక్కయింది.
చైర్మన్ నిర్ణయాలను కోర్టులే ప్రశ్నించవని, అలాంటిది మండలి కార్యదర్శి ఆయన ఆదేశాలను ధిక్కరించడం విచిత్రంగా ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మండలి కార్యదర్శి తీరుపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని హెచ్చరించారు. మొత్తానికి మండలి విషయంలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న ఈ రూల్స్ వార్ లో విజయం ఎవరిని వరిస్తుందో?
135056 940130Speedily and easily build your web traffic and PR, which provides Web website visitors to add your page to any social bookmarking internet site. 15956