వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై రాష్ట్ర ప్రజానీకం గుస్సా అవుతున్నారు.
తమ బండారం బయటపడేసరికి, వైసీపీ భుజాలు తడుముకుంటోంది. ‘గతంలో టీడీపీ కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం భూ కేటాయింపులు చేసుకుంది..’ అంటూ, టీడీపీ కార్యాలయాలకు సంబంధించిన ఫొటోల్ని వైసీపీ విడుదల చేస్తోంది.
13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్లో ఎన్ని టీడీపీ జిల్లా కార్యాలయాలున్నాయి.? అన్నదానిపై జనానికి ఓ స్పష్టత వుంది. సరే, వాటిల్లో అక్రమాలు జరిగాయా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. అక్రమాలే జరిగి వుంటే, ఐదేళ్ళ పాలనలో ‘ప్రజా వేదిక’ని కూల్చేసినట్లుగా, టీడీపీ కార్యాలయాల్ని వైసీపీ కూల్చేయకుండా వుంటుందా.?
ఇక్కడే దొరికిపోయింది వైసీపీ అడ్డంగా.! 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలు కట్టుకుందంటే, ఏ స్థాయిలో వైసీపీ హయాంలో ‘బూ సంతర్పణ’ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తం సమకూర్చుకోబడిన భూముల్లోనూ వైసీపీ కార్యాయాలు వెలిశాయ్.
అనుమతుల్లేకుండా నిర్మాణాలు అడ్డగోలుగా జరిగిన దరిమిలా, వాటిని ప్రస్తుతం అధికారులు కూల్చేస్తున్నారు. ప్రైవేటు భవనం లింగమనేని గెస్ట్ హౌస్కి సంబంధించి చిన్నపాటి ఆక్రమణ వుందన్న కోణంలో, ఆ ఆక్రమణల్ని వైసీపీ హయాంలో కూల్చేసిన సంగతి తెలిసిందే.
ప్రజా అవసరాల నిమిత్తం టీడీపీ హయాంలో ప్రజావేదిక నిర్మిస్తే, దాన్ని వైసీపీ అధికారంలోకి వస్తూనే కూల్చేసింది. ఇవన్నీ వైసీపీ దృష్టిలో కరెక్ట్ అయినప్పుడు, వైసీపీ కార్యాలయాల కూల్చివేత కూడా సబబే కదా.! కాదూ, టీడీపీ కూడా నిర్మాణాలు చేసుకుంది.. అని వైసీపీ చెబుతోందంటే, ఆ తప్పే తామూ చేశామని వైసీపీ చెబుతున్నట్టే కదా.?